KCR: ఏడాదిన్నరలో ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది. అంతా చూస్తున్నారు

Subhani Syed
2 Min Read

తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడు అర్థమవుతోంది – కేసీఆర్ (KCR)

తెలంగాణ ప్రజలు ఏంకోల్పోయారో ఇప్పుడు తెలుస్తోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల కోరికలను బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అర్థం చేసుకోగలదని స్పష్టం చేశారు. “తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎంత ఆలోచిస్తారో, ఇతర పార్టీలకు అంత ఆవేదన ఉండదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడిన ఉద్యమ బలం మాకే ఉంది” అని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు. దశాబ్దాల పాటు పోరాటం చేసి, నిరాశలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం నింపి, రాష్ట్రం కోసం శాంతియుతంగా ఉద్యమం చేసిన చరిత్ర బీఆర్ఎస్‌దని గొప్పగా చెప్పారు.

రజతోత్సవ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఎర్రవల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహాక సమావేశంలో  కేసీఆర్ కీలకంగా మాట్లాడారు. “తెలంగాణ వచ్చాక ప్రజలు ఇచ్చిన ప్రేమతో 9.5 ఏళ్లు రాష్ట్రాన్ని ప్రజలకు నచ్చేలా పాలించాం. ఉద్యమ స్ఫూర్తితో చేసిన మా పాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది” అని అన్నారు. వ్యవసాయం, అన్ని రంగాలు, అన్ని వర్గాల కోసం బీఆర్ఎస్ చేసిన పని గొప్పదని చెప్పారు. “ప్రజల బాగోగులే మాకు ముఖ్యం అని నిజాయితీగా పని చేయడం మాకు మాత్రమే సాధ్యం. ఏడాదిన్నరలో ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది. అంతా చూస్తున్నారు” అని గులాబీ బాస్ అన్నారు.

kcr

ప్రజల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యంపై ఆవేదన

రాష్ట్రంలో వ్యవసాయం, కరెంటు, సాగునీరు, తాగునీరు, ఇతర సౌకర్యాల గురించి కేసీఆర్ నాయకులతో మాట్లాడారు. ప్రజల కష్టాలు, ప్రభుత్వ పనితీరును నాయకులు వివరించారు. “ఇంతకు ముందు నీళ్లతో నిండిన బోర్లు ఇప్పుడు ఎండిపోతున్నాయి” అని చెప్పారు. “ఇవన్నీ నాకు తెలుసు. ప్రభుత్వం సరిగా పని చేయకపోవడంతో రైతులు బాధల్లో ఉన్నారు” అని కేసీఆర్ బాధపడ్డారు. “పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాం. కానీ ఇప్పుడు గ్రామాలు ఆదరణ లేక అస్తవ్యస్తంగా ఉన్నాయి” అని ఆందోళన చెప్పారు.

కాంగ్రెస్ మోసంపై కేసీఆర్ విమర్శ

“కాంగ్రెస్ అధికారం కోసం తప్పుడు హామీలు ఇచ్చి, దేవుడి మీద ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసింది. ఏడాదిన్నరైనా ఏమీ చేయకుండా, చేస్తున్నట్టు నటిస్తోంది. ప్రజలు బాధపడుతున్నారు” అని కేసీఆర్ అన్నారు. రజతోత్సవ సభకు ప్రజలు తమ ఇష్టంతో వస్తారని, అద్భుతంగా జరుగుతుందని చెప్పారు.

Share This Article