Pawan Kalyan: పవన్ వ్యవహారం మెగా ఫ్యామిలీకి నచ్చలేదా… అందుకే మౌనం వహిస్తున్నారా?

2 Min Read

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈయన బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇటీవల తిరుపతి లడ్డు విషయంలో మాత్రం కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందనే విషయం తెలియడంతో ఎంతో ఆ పవిత్రం జరిగిందని ఈ తప్పుకు ప్రాయశ్చిత్తంగా తాను ప్రాయశ్చిత దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఇక ఈయన చెప్పిన విధంగానే 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష వేశారు. పవన్ కళ్యాణ్ ఇలా ప్రాయశ్చిత్త దీక్ష చేయడంతో విభిన్న రకాలుగా ఈయన పట్ల కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా వైకాపా నాయకులు ఈయన దీక్షపై స్పందిస్తూ వాళ్లే అసత్యపు వార్తలను ప్రచారం చేసి తప్పు చేశారు కనుక ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: Nithya Menon: పెళ్లయిన హీరో కాపురంలో చిచ్చుపెట్టిన నిత్యమీనన్.. విడాకుల వరకు వెళ్లిందా?

Mega family doesn't like Pawan kalyan behaviour

Mega Family Is Silent Because They Disapprove of Pawan kalyan behaviour

పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడితే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు మద్దతు తెలియజేస్తూ అవతల వారికి తన స్టైల్ లోనే సమాధానం చెబుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు గురించి అలాగే హిందూ ధర్మాన్ని కాపాడాలని సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడుతున్నప్పటికీ ఎవరు మెగా కుటుంబ సభ్యులు ఈ విషయంపై నోరు విప్పలేదు. దీంతో పలువురు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయంలో వ్యవహరిస్తున్న శైలి మెగా కుటుంబానికి కూడా నచ్చలేదని, అందుకే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా మౌనం పాటిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హిందూ మతస్తుడిగా హిందూ మతం గురించి సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ ధర్మాన్ని కాపాడటం కోసం తాను ప్రాణాలు కూడా వదులుతానని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నీ సనాతన ధర్మం ఎక్కడికి వెళ్లింది అంటూ విమర్శలు చేస్తున్న తరుణంలోనే మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయంపై స్పందించలేదని తెలుస్తోంది.

Share This Article
Exit mobile version