Sai Dharam Tej : సేఫ్ హాండ్స్ ఎక్కడ… మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పై భారీ ట్రోల్స్!

2 Min Read

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఈయన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కోవడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ సదురు భాదిత మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

జానీ మాస్టర్ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో తన పట్ల ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధింపులకు గురి చేశారు అంటూ సదురు మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె నార్సింగ్ ప్రాంతంలో నివసిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఇక ఫిర్యాదు అందుకున్న పోలీసులు జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జానీ మాస్టర్ ఇలాంటి చర్యలకు పాల్పడటంతో ఎంతోమంది ఈయనని కఠినంగా శిక్షించాలని డిమాండ్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే సాయి ధరమ్ తేజ్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. మధ్యలో సాయి ధరమ్ తేజ్ ట్రోల్స్ ఎదుర్కోవడానికి కారణం లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఇకపై ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సేఫ్ హాండ్స్ లో ఉండబోతుంది అంటూ కామెంట్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగిన ఈయనని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఏపీలో జరిగిన అత్యాచార ఘటనలో, అలాగే హిడెన్ కెమెరాల ఘటనలో కూడా సాయిధరమ్ తేజ్ ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇక తాజాగా జానీ మాస్టర్ విషయంలో కూడా ఈయన పై ట్రోల్స్ జరుగుతున్నాయి. అయ్యా సేఫ్ హాండ్స్ ఎక్కడున్నావు జానీ మాస్టర్ ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటూ ఉంటే ఎందుకు స్పందించలేదు కాస్త స్పందించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కావటం విశేషం అంతేకాకుండా ఈయన జనసేన పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఈయనని రాజకీయ పరంగా కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

Share This Article
Exit mobile version