అస్తమించిన వ్యాపార దిగ్గజం.. Ratan Tata ఆఖరి పోస్ట్ ఇదే?

2 Min Read

Ratan Tata : ప్రముఖ వ్యాపారం దిగ్గజం టాటా గ్రూప్స్ సమస్థల అధినేత రతన్ టాటా ఇకలేరు అనే వార్త ప్రతి ఒక్క భారతీయుడిని ఎంతగానో కలిచి వేస్తుంది. రతన్ టాటా భారతీయ వ్యాపార రంగంలో ఎంతో అద్భుతమైన విజయాలను అందుకొని ఎందరికో స్పూర్తిగా నిలిచారని చెప్పాలి. ఇలా ఎందరికో ఆదర్శంగా నిలిచిన రతన్ టాటా అనారోగ్య సమస్యల కారణంగా నేడు మరణించిన విషయం అందరికీ జీర్ణించుకోలేనిదని చెప్పాలి.

రతన్ టాటా(Ratan Tata) ఆరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనారోగ్యానికి గురైన ఈయనని ముంబైలోని బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.అతను వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తనకుతానే సాటి. గత కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు.

Also Read : Ratan Naval Tata : నిష్క్రమించిన వ్యాపార దిగ్గజం.. బిజినెస్ టైకూన్‌ రతన్ టాటా కన్నుమూత……

ratan tata passes away

ఇలా ఎంతో మంచి పనులు చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఈయనని దేశంలో ద్వేషించే వ్యక్తే లేరు అంటూ ఒకానొక సందర్భంలో రతన్ టాటా ఎంతో గొప్పగా తన గురించి తానే వర్ణించుకున్నారు. ఇలాంటి ఒక వ్యక్తి నేడు లేరనే విషయం అందరిని అయోమయానికి గురిచేస్తుంది. ఇక రతన్ టాటా మరణించడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రతన్ టాటా సోషల్ మీడియా వేదికగా చేసిన ఆఖరి పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

గత మూడు రోజుల క్రితం రతన్ టాటా ఉన్న ఫలంగా అనారోగ్యానికి గురయ్యారని ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా స్పందిస్తూ పోస్ట్ చేశారు. నా ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ పాలయ్యానంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదు వయసు పైబడటంతో జనరల్ చెకప్ కోసమే తాను హాస్పిటల్ కి వెళ్ళానని నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ ఈయన ఈ వార్తలను ఖండించారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన మూడు రోజులకే ఆయన మరణించడం అందరినీ ఎంతగానో కలిచి వేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

TAGGED:
Share This Article
Exit mobile version