Rakul: టాలీవుడ్ లో ఆ హీరో ఒక్కడే దమ్మున్నోడు.. ఆ హీరోల పరువు తీసేసిన రకుల్!

2 Min Read

Rakul: సినీనటి రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి, కొండ పొలం అనే సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈమె సౌత్ సినిమాలకు కూడా దూరమవుతూ వచ్చారు.. ఇలా సౌత్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఇటీవల బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో పడినట్లు ఈమె తెలిపారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈమె ఎంతో ఘనంగా గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత కూడా రకుల్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె టాలీవుడ్ హీరోల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్, గోపీచంద్, రామ్, నాగచైతన్య, నాగార్జున వంటి ఎంతోమంది హీరోలతో కలిసి సినిమాలలో నటించారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ గురించి ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ రకుల్ హీరో హీరోయిన్లుగా సరైనోడు సినిమాలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా సమయంలో అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తానని తనతో చెప్పినట్టు ఈమె వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసి తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలను పెంచారని రకుల్ ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఈమె మెగా హీరోలతో సినిమా చేసినప్పటికీ మెగా హీరోల గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా అల్లు అర్జున్ గురించి మాట్లాడటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్టార్ హీరో అంటూ పరోక్షంగా చెప్పకనే చెప్పారని ఇతర హీరోల అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Exit mobile version