NTR: ఆ క్షణం ఎంతో భయపడిపోయాను… సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్!

2 Min Read

NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అనంతరం చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ తన కెరియర్లో హిట్లతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా హిట్టు ఫ్లాపులు రావడం అనేది సర్వ సాధారణమని చెప్పాలి.

ఇక ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇలా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్న ఎన్టీఆర్ త్వరలోనే దేవర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ ముంబైలో డైరెక్టర్ సందీప్ రెడ్డితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ముంబై గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు గతంలో ముంబై అంటే చాలా భయం ఉండేదని తెలిపారు..

ఇక్కడ నటన పరంగా ఆర్టిస్టులు అలాగే టెక్నీషియన్లు ఎలా ఉంటారో అనే విషయంలో కంగారుగా ఉండేది. మొదటిసారి ఒక యాడ్ షూట్ కోసం ముంబై వచ్చాను. ఆ సమయంలో చాలా భయపడ్డానని ఎన్టీఆర్ తెలిపారు. అనంతరం RRR సినిమా ప్రమోషన్ల కోసం ఇక్కడికి వచ్చాను.అప్పుడు కాస్త భయం తగ్గింది జక్కన్న ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయని తెలిపారు.

ఇక ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్ల కోసం ముంబై వస్తున్నానని అయితే తనకు ఎలాంటి భయం లేదని ఇక్కడ అందరూ కూడా సినిమా కిందనే పనిచేస్తున్నారని అందరూ సమానమే అని అర్థమైంది అంటూ ఈ సందర్భంగా ముంబై గురించి ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

TAGGED:
Share This Article
Exit mobile version