Janhvi Kapoor: ఆ వ్యక్తి కారణంగానే టాలీవుడ్ అవకాశాలు వచ్చాయి.. దేవర బ్యూటీ కామెంట్స్ వైరల్!

2 Min Read

Janhvi Kapoor: దివంగత సీనియర్ నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఈమె తన తల్లి శ్రీదేవి ఉన్న సమయంలోనే ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే శ్రీదేవి మరణం ఇండస్ట్రీని కుదిపేసింది. ఇలా శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటివరకు పలు బాలీవుడ్ సినిమాలలో నటించి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇలా ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో కొనసాగుతున్న ఈమె మొదటిసారి తెలుగు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రావడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే దేవర సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ టాలీవుడ్ అవకాశాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవడం చాలా సులభం అందుకే తాను ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించానని తెలిపారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా కాదని ఈమె వెల్లడించారు. ఎప్పటినుంచో టాలీవుడ్ సినిమాలలో నటించాలన్నదే నా కోరిక దేవర సినిమాతో ఆ కోరిక నెరవేరిందని తెలిపారు.

ఇక సౌత్ సినిమాలలో నటించాలనే కోరికతో ఉన్న నాకు తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అదే సమయంలోనే దేవర ఛాన్స్ కూడా వచ్చింది. ఇలా రెండు అవకాశాలు ఒకేసారి రావడంతో ఏ సినిమాకు నేను కమిట్ అవ్వాలన్న ఆలోచనలో పడిపోయాను.. ఈ సమయంలోనే తాను కరణ్ జోహార్ దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావించగా ఆయన ఒకటే మాట అన్నారు. ముందు ఎన్టీఆర్ తో సినిమా చేసేసెయ్ తరువాత అవకాశాలు వాటి అంతట అవే వస్తాయి అని సలహా ఇచ్చారు.

ఇలా ఆయన ఇచ్చిన సలహా కారణంగానే తాను దేవర సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు. ఆయన ఇచ్చిన సలహా నాకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. ఇంకా దేవర సినిమా విడుదలకుండానే మరొక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించిన అవకాశం కూడా తనకు వచ్చింది అంటూ ఈ సందర్భంగా టాలీవుడ్ అవకాశాల గురించి జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

TAGGED:
Share This Article
Exit mobile version