Mokshagna Teja ఇండస్ట్రీకి లాంచ్ చేయాల్సింది ప్రశాంత్ వర్మ కాదా.. బాలయ్య ప్లాన్ వేరే ఉందా?

2 Min Read

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి అతి త్వరలోనే పరిచయం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మోక్షజ్ఞ మొదటి సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాకు సంబంధించి పస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ లుక్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది దీంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇదిలా ఉండగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి ఫలానా దర్శకుడు పరిచయం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. చివరికి ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు డైరెక్టర్గా ఫైనల్ అయ్యారు కానీ తన కొడుకు విషయంలో బాలకృష్ణ ప్లాన్ వేరే ఉండేదని తెలుస్తోంది.

Mokshagna Teja

బాలకృష్ణకు తన కుమారుడిని సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఉండేదట అంతేకాకుండా తాను నటించిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చిత్రంగా తన కొడుకును పరిచయం చేయాలని భావించారట. అయితే తన ప్లాన్స్ అన్ని కాదని తన కొడుకుని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఇండస్ట్రీకి లాంచ్ చేయాల్సి వస్తుంది.

ఇలా ప్రశాంత్ వర్మ ఫైనల్ అవ్వడానికి కారణం బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమం అని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కావడంతో ఆయన పనితీరు ఎలా ఉంటుందో బాలకృష్ణ స్వయంగా చూశారు. అందుకే తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రశాంత్ వర్మ కరెక్ట్ అని భావించిన బాలకృష్ణ తన ఆలోచనలను పక్కనపెట్టి సరికొత్త కథతో తన కొడుకును ఇండస్ట్రీకి లాంచ్ చేసే బాధ్యతలను ప్రశాంత్ వర్మకు అప్పగించారని తెలుస్తుంది.

ఆ షోకి తేజస్విని కూడా వర్క్ చేసింది. దీంతో ప్రశాంత్‌ ఏంటో ఆమె కూడా గమనించింది. ఇక ఈ ఇద్దరు అభిప్రాయంతో ప్రశాంత్‌ వర్మను ఫైనల్ చేయడమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా తేజస్విని వ్యవహరించడం విశేషం.

Share This Article
Exit mobile version