కేంద్రం గుడ్ న్యూస్.. ఆరు కోట్లమంది వృద్ధుల కోసం మోదీ సర్కార్ అదిరిపోయే స్కీమ్……

2 Min Read

మోదీ సర్కార్ వయో వృద్ధులకు ఒక గుడ్ న్యూస్ వినిపించింది. వరుసగా మూడోసారి ఎన్నికైన తర్వాత మోదీ ప్రభుత్వం.. వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్యం వంటి కీలక అంశాలపై ప్రస్తుతం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే వృద్ధులకి ఉచితంగా చికిత్స పొందేందుకు పెద్ద అవకాశాన్ని తీసుకొస్తుంది. 70 ఏళ్ళు నిండిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇది ఆరోగ్య బీమా పథకం. ఒక విధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఇది రక్షణ కవచంగా వర్క్ చేస్తుంది. దేశంలోని ఈ విధంగా ఏడుపదులు నిండిన వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకి తెలియజేసారు. ఇది గొప్ప మానవతావాదంతో తీసుకున్న నిర్ణయమని ఆయన అన్నారు.

దేశంలో చూస్తే డెబ్బై ఏళ్లు నిండినివారు ఆరు కోట్ల దాకా ఉన్నారు. వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఇక 70 ఏళ్లు నిండితే చాలు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఇతర వ్యవహారాలతో సంబంధం లేకుండా.. 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా పథకం వర్తింజేయడమే దీని ఉద్దేశం. దీని వల్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం వారు ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ పథకం కింద ఇప్పటికే ఉన్న కుటుంబాల్లో సీనియర్ సిటిజన్లకి మరో 5 లక్షల బీమా వర్తింపజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం 2018 వ సంవత్సరం సెప్టెంబరు నెలలో ప్రారంభించింది. అంటే ఇప్పటికి ఆరు ఏళ్లు నిండాయి. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబంలో పేదలకు ఆయుష్మాన్ భారత్ కార్డుని అందజేస్తారు.

ఈ కార్డులతో వారు ఆసుపత్రిలో చేరినప్పుడు అయిదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతోంది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు.. 70 ఏళ్లు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అంటే ఇది వయో వృద్ధులకి ఒక వరంగా మారుతోంది అని చెప్పాలి. మొత్తానికి కేంద్రం మంత్రి వర్గం సీనియర్ సిటిజన్స్ పై కరుణ చూపిందనే చెప్పాలి. దీని వల్ల ఎవరి ఆసరా సాయం లేకుండా జీవితం చరమాంకంలో తమకి వచ్చే జబ్బులకి రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు.

Share This Article