Ratan Tata Success : అసలు రతన్ టాటా ఎవరు? వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారు?…..

8 Min Read

Ratan Tata success story : భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, వ్యాపారవేత్త “రతన్ టాటా” ఇక లేరు. గొప్పగొప్ప ఆలోచనలతో ఎన్నో కంపెనీలు స్థాపించి సక్సెస్ అయ్యి విలువలు కలిగిన వ్యాపారవేత్త, దేశాభివృద్ధిలో తన పాత్ర ఉండాలని నిత్యం తపించే మనిషి రతన్ టాటా.. సక్సెస్ స్టోరీ యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. అంతటి గొప్ప వ్యక్తిత్వం గల రతన్ టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏవిధంగా.. ఎలా స్థాపించారు? అనేక విజయాలను అందుకుంటూ.. గొప్ప మానవతావాదిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

1868లో స్థాపించిన టాటా గ్రూప్ భారత ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆటోమోటివ్, స్టీల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక రంగాల్లో సేవలను అందిస్తోంది. 1990నుంచి 2012వరకు టాటా గ్రూప్‌కు రతన్ టాటా(Ratan Tata success story) ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత అక్టోబరు 2016నుంచి ఫిబ్రవరి 2017వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా రతన్ టాటా కొనసాగారు. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఆయన ఎన్నో సేవలిందించారు. ఒక మానవతావాదిగా ఆయన అసాధారణ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేకతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

ఎవరు ఈ రతన్ టాటా..!

రతన్ నావల్ టాటా.. నావల్ టాటా కుమారుడు. టాటా గ్రూప్(Ratan Tata success story) వ్యవస్థాపకుడు జమ్‌సెట్జీ టాటా తనయుడు రతన్‌జీ టాటా దత్తత తీసుకున్నారు. ఆయన కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టా పొందడం జరిగింది. 1961లో టాటాకంపెనీలో చేరారు. అక్కడే ఆయన టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పనిచేశారు. ఆ తర్వాత 1991లో టాటాసన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

Also Read : Ratan Naval Tata : నిష్క్రమించిన వ్యాపార దిగ్గజం.. బిజినెస్ టైకూన్‌ రతన్ టాటా కన్నుమూత……

Ratan Tata Success Story

టాటా వ్యక్తిగత జీవితం

1937లో డిసెంబర్ 28న ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. ఆయన సూరత్‌లో నావల్ టాటా, జమ్‌సెట్‌జీ మేనకోడలు సూని టాటా తరువాత టాటా ఫ్యామిలీలోకి ఆయన్ను దత్తత తీసుకున్నారు. టాటా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యారు. 1948లో రతన్ టాటాకు 10ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆతరువాత టాటా అమ్మమ్మ, నవాజ్‌బాయి టాటా ఆయన్ను దత్తత తీసుకున్నారు. సిమోన్ టాటాని తండ్రి నావల్ టాటా రెండోపెళ్లి చేసుకున్నారు. దాంతో రతన్ టాటాకు ఒక తమ్ముడు జిమ్మీటాటా, అలాగే సవతిసోదరుడు నోయెల్ టాటా ఉన్నారు.

టాటా తన చిన్నతనంలో ఎక్కువభాగం భారత్‌లోనే గడిపారు. లాస్ఏంజిల్స్‌లో ఉండగా దాదాపు ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. కానీ, దురదృష్టవశాత్తు.. రతన్ టాటా(Ratan Tata success story) అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన భారత్‌కు వెళ్లవలసి వచ్చింది. తన కాబోయే జీవితభాగస్వామి తనతో కలిసి భారత్ వెళ్లాలని భావించారు. అప్పట్లో ఇండో-చైనా యుద్ధం కారణంగా భారత్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా ఆమె పేరెంట్స్ అంగీకరించలేదు. అక్కడితో వారిద్దరి అనుబంధం ముగిసింది.

విద్య, వృత్తి సాగిందిలా..!

రతన్ టాటా ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌లో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ముంబైలోని కేథరల్ & జాన్ కానన్ స్కూల్లో చదివారు. ఆపై సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌లో కూడా చదివారు. న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్‌లో కూడా చదువుకున్నారు. 1955లో హైస్కూల్ నుంచి పట్టా పొందాక టాటా కార్నెల్ యూనివర్శిటీలో చేరారు. అక్కడే ఆయన 1959లో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

2008లో టాటా కార్నెల్‌కు 50మిలియన్ డాలర్ల బహుమతిగా అందించి యూనివర్శిటీ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. 1970లో టాటా గ్రూప్‌లో టాటాకు మేనేజిరియల్ పదవిని కూడా పొందారు. 21ఏళ్లలోనే టాటాగ్రూప్ ఆదాయం 40రెట్లు పెరిగింది. కంపెనీ లాభం 50రెట్లు పెరిగింది. రతన్ టాటా కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పుడు అత్యధికవిక్రయాలతో జోరుమీద ఉంది. కానీ, ఆతర్వాత అత్యధిక విక్రయాలు కంపెనీ బ్రాండ్ నుంచే వచ్చాయి.

1991లో టాటాసన్స్‌కు చెందిన జేఆర్డీ టాటా(Ratan Tata success story) చైర్మన్ పదవి నుంచి వైదొలిగడం జరిగింది. రతన్ టాటా ఆయన వారసుడిగా బాధ్యతల స్వీకరణతో ప్రయాణం ప్రారంభమైంది. రుస్సీ మోడీ (టాటా స్టీల్), దర్బారీ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమితులయ్యారు. సేథ్ (టాటాటీ, టాటాకెమికల్స్), అజిత్ కెర్కర్ (తాజ్ హోటల్స్) నాని పాల్ఖివాలా (పలు టాటాకంపెనీల బోర్డులలో డైరెక్టర్) అలాగే జేఆర్డీ టాటా వారసుడిగా భావిస్తున్నారు. ఇది వారి మధ్య తీవ్రవాగ్వాదానికి దారితీసింది. చాలామంది ఈ నిర్ణయంతో విభేదించారు. అప్పట్లో మీడియా కూడా రతన్ టాటా డెసిషన్ ని తప్పుగా ఎత్తిచూపింది.

కానీ, రతన్ టాటా(Ratan Tata success story) పట్టుదల, అంకితభావంతో పని చేస్తూనే ఉన్నారు. తన పదవీ కాలంలోనే పదవీవిరమణ వయస్సును కూడా నిర్ణయించారు. దానిప్రకారం.. పదవీ విరమణ వయస్సు 70కి నిర్ణయించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు 65ఏళ్ల వయస్సులో పదవీవిరమణ చేస్తారు. సేథ్, కెర్కర్ వయస్సు పరిమితి దాటగా వారు పదవీవిరమణ చేశారు. అనారోగ్య కారణాలవల్ల పాల్ఖివా ఉద్యోగం నుంచి నిష్క్రమించారు. వారసత్వ సమస్య పరిష్కరించిన తర్వాత రతన్ టాటా ముఖ్యమైన వాటిపై దృష్టి సారించడం ప్రారంభించారు.

టాటా బ్రాండ్ నేమ్‌ను ఉపయోగించుకున్నందుకు టాటాసన్స్‌కి రాయల్టీ చెల్లించమని గ్రూప్ కంపెనీలను ఒప్పించాడు. వ్యక్తిగత కంపెనీలను గ్రూప్ ఆఫీసుకు రిపోర్టు చేయమన్నారు. సాఫ్ట్‌వేర్ వంటి ఇతర వాటిపై దృష్టిని పెంచింది. టెలికాం వ్యాపారం, ఫైనాన్స్ రిటైల్‌లో కూడా టాటాగ్రూపు ప్రవేశించింది. అదేసమయంలో విమర్శలు వచ్చినప్పటికీ జేఆర్డీ టాటా రతన్ టాటాకు మార్గదర్శకుడిగా మార్గనిర్దేశం చేశారు.

రతన్ టాటా సాధించిన విజయాలు

కెరీర్ ప్రారంభంలో అనుభవంలేని కారణంగా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. టాటాగ్రూప్ పగ్గాలను చేపట్టారు. 65శాతం ఆదాయాలు విదేశాల నుంచి వచ్చేవిధంగా నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ గ్రూపుఆదాయాలు 40రెట్లు పెరిగాయి. రానురానూ కంపెనీ లాభాలు 50రెట్లు పెరిగాయి. వ్యాపారాన్ని ప్రపంచీకరణ చేసే లక్ష్యంతో టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో అనేక వ్యూహాత్మక కొనుగోళ్లు చేసింది. ఇందులో లండన్‌కు చెందినటువంటి టెట్లీ టీని 431.3మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

దక్షిణ కొరియాకు చెందిన డేవూ మోటార్స్ ట్రక్కుల తయారీ యూనిట్‌ను 102మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆంగ్లో-డచ్ కంపెనీ కోరస్ గ్రూప్‌ని 11.3బిలియన్ డాలర్లకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. టాటా టీ ద్వారా టెట్లీ, టాటా మోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటా స్టీల్ ద్వారా కోరస్‌తోసహా ఈ కొనుగోళ్లు టాటాగ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేశాయి. దాదాపు 100దేశాలకుపైగా టాటా కంపెనీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. భారతీయ పారిశ్రామికరంగంలో కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది.

టాటానానో అరంగ్రేటం

2015లో రతన్ టాటా(Ratan Tata success story).. టాటానానో కారును ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మధ్య, దిగువ-మధ్య-ఆదాయ వినియోగదారులకు అత్యంత సరసమైనదిగా మారింది. ఐదుగురు కూర్చునే సామర్థ్యం కలిగిన ఈకారు ప్రారంభధర 2వేల డాలర్లు. టాటానానో అనేది స్థోమతపరంగా సామాన్యుల కారుగా పేరుగాంచింది.

రతన్ టాటా దాతృత్వ విరాళాలు

రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాలలో దాదాపు 60నుంచి 65శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందించారు.

బిరుదులు, గౌరవ డాక్టరేట్స్

రతన్ టాటాకు భారత రెండో అత్యున్నత పౌరపురస్కారం, పద్మవిభూషణ్, మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్ లభించాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఒహియో స్టేట్ యూనివర్శిటీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ ఐఐటి ఖరగ్‌పూర్‌తో సహాపలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవడాక్టరేట్‌లను కూడా అందుకున్నారు.

75ఏళ్ల వయస్సులో పదవీవిరమణ

రతన్ టాటా డిసెంబరు 28, 2012న 75ఏళ్ల వయసులో పదవీవిరమణ చేశారు. ఆయన తరువాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందినటువంటి సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. అయితే, బోర్డ్ఆఫ్ డైరెక్టర్ల నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురైంది. దాంతో మిస్త్రీని 2016లో ఆయన ఆస్థానం నుంచి తొలగించారు. రతన్ టాటా(Ratan Tata success story) తాత్కాలిక ఛైర్మన్‌గా పనిచేశారు. 2017జనవరిలో నటరాజన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ ఛైర్మన్‌గా, రతన్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం, రతన్ టాటా.. టాటాట్రస్ట్స్, టాటాసన్స్‌కి నాయకత్వం వహిస్తున్నారు. జేఆర్డీ టాటా తరువాత రెండు కంపెనీలకు రెండో అధినేతగా రతన్ టాటా ఉన్నారు.

విద్యారంగంలో నాణ్యమైన విద్య కోసం అనేక విరాళాలను అందించారు. వైద్యరంగానికి కూడా తనవంతు కృషిగా అనేకవిరాళాలను అందించారు. గ్రామీణ, వ్యవసాయాభివృద్ధికి కూడా తనవంతు సహకారం అందించారు. 1991లో సర్ రతన్ టాటా ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. రతన్ టాటా ఈ ట్రస్ట్ ద్వారా వివిధరంగాలలో వెనుకబడినవారి సంక్షేమం కోసం సేవలందించారు.

కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదురైనా.. వెనుకడుగు వేసింది లేదు!

రతన్ టాటా కెరీర్‌లో అనేకసవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్నిసవాళ్లు ఎదురైనా అలానే ముందుకుసాగి ఎన్నోవిజయాలను అందుకున్నారు. కోర్ మేనేజ్మెంట్ నుంచి 50లక్షల రూపాయల నిధులను మంజూరు చేయకపోవడంతో 1977లో ఎంప్రెస్ మిల్‌ యూనిట్‌ను రతన్ టాటా మూసేయాల్సి వచ్చింది. ఆ యూనిట్ విప్లవాత్మకంగా ఉండాలని ఆయన కలలు కన్నారు. కానీ, దురదృష్టవశాత్తు రతన్ నిరాశకు గురిచేసింది.

1981లో జేఆర్డీ టాటాచే టాటాగ్రూప్(Ratan Tata success story) ఆఫ్ ఇండస్ట్రీస్ తదుపరి వారసుడిగా ప్రకటించడం జరిగింది. అప్పుడు కూడా రతన్ టాటా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. టాటాగ్రూప్స్ ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వాటాదారులతోపాటు అందరూ ఆయన్ను విశ్వసించారు. 1998లో కారు మార్కెట్‌లోకి రావాలని నిర్ణయించుకున్నారు. టాటాఇండికా పేరుతో తన మొదటికారు మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అయితే, టాటాకారును కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగాఆసక్తి చూపలేదు.

1999లో మొత్తం కంపెనీని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఫోర్డ్ మోటార్స్‌ను ఆయన సంప్రదించారు. కానీ, రతన్ టాటాను(Ratan Tata success story) ఆ ఫోర్డ్ యజమాని అవమానించారు. అంతపెద్ద వ్యాపారవేత్తకు ఎంతో సమస్యాత్మకమైన పరిస్థితి ఎదురైంది. మీకు ప్యాసింజర్ కార్ల గురించి ఏమీ తెలియనప్పుడు.. వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేశారని పేర్కొంటూ ఫోర్డ్ రతన్ టాటాను అవమానించింది. 2008లో జాగ్వార్-ల్యాండ్ రోవర్ యూనిట్‌ను కొనుగోలు చేయడంతో ఫోర్డ్‌ను దివాలా నుంచి రక్షించారు. ఈమాటలకు రతన్ టాటా వెంటనే సమాధానమిచ్చారు. ఇందుకోసం టాటా కూడా రూ.2500కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

TAGGED:
Share This Article