Pawan Kalyan : కార్తీ తిరుమల లడ్డు వివాదం పై మరోసారి స్పందించిన పవన్.. బ్రదర్స్ అంటూ!

2 Min Read

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లడ్డు కల్తీ జరిగిందనే విషయం బయటకి రావడంతో పెద్ద ఎత్తున ఈ విషయం చర్చలకు కారణమైంది. అయితే ఈ విషయం తెలిసిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇక నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈయన దీక్ష విరమణ చేసారు. 11 రోజులపాటు ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తిరుపతి లడ్డు వ్యవహారం కేవలం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ఈ విషయంపై స్పందిస్తూ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తమిళ హీరో కార్తీ తన సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతి లడ్డు విషయం రావడంతో ఇదొక సెన్సిటివ్ ఇష్యూ అంటూ మాట్లాడారు దీనితో అక్కడ ఉన్న వారందరూ కూడా నవ్వడంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది.

Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను వెంటనే డిస్మిస్ చెయ్యండి… తెరపైకి కొత్త డిమాండ్?

దీంతో ఆయన కార్తీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్(Pawan Kalyan) ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో కార్తీ క్షమాపణలు కూడా చెప్పారు. ఈయన క్షమాపణలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక ఇంతటితో ఈ వివాదం ముగిసిన అనుకునేలోపు మరోసారి కార్తీ తిరుపతి లడ్డు గురించి చేసిన వివాదం పై పవన్ కళ్యాణ్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఈ ప్రశ్న ఎదురు కావడంతో మరోసారి ఈ విషయం గురించి పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కార్తీ, సూర్య ఇద్దరూ భక్తులే, వాళ్ళు కూడా తిరుమలకు వెళ్లారు. కార్తీ గారు కావాలని అలా మాట్లాడలేదు. కానీ అయన అనుకోకుండా అలా మాట్లాడటం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడంతో అలాంటి ఇష్యూ మీద నెగిటివ్ గా వెళ్ళింది. వాళ్ళు సెలబ్రిటీ పర్సన్స్ కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను అలా మాట్లాడానని పవన్ తెలిపారు.. తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేసే ఎంతోమంది సెలబ్రిటీలు నాకు సోదర సమానులు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరో కార్తీ విషయంపై మరోసారి స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article