Pawan Kalyan: రోడ్డుపై పవన్ ను అలా చూసి కడుపు తరుక్కుపోయింది: అంజనాదేవి

2 Min Read

Pawan Kalyan : సినీనటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను కాస్త పక్కన పెట్టి రాజకీయాలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా సక్సెస్ అందుకొని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన తల్లి అంజనాదేవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ పడిన ఇబ్బందుల గురించి ఆమె మాట్లాడారు. దీంతో ఈ ప్రోమో వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమో వీడియోని జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పవన్ కళ్యాణ్ గురించి అంజనదేవి ఎలాంటి విషయాలను చెప్పారనే ఆసక్తి జన సైనికులలోను అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులలో ఆత్రుత పెరిగింది.

Also Read :Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను వెంటనే డిస్మిస్ చెయ్యండి… తెరపైకి కొత్త డిమాండ్?

Anjanadevi about pawan kalyan

ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ పవన్ కళ్యాణ్ గతంలో రోడ్డుపై పనుకొని నిరసన తెలిపిన సంఘటనను గుర్తు చేశారు. ఈ విషయం గురించి అంజనదేవి మాట్లాడుతూ ఆరోజు అలా పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకోవడం చూసి కడుపు తరుక్కుపోయిందని చాలా బాధ కలిగిందని ఈమె తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ చిన్నప్పటినుంచి కూడా ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని తెలిపారు..

తాను ఏదైనా చేయాలని అనుకుంటే అది చేసేవరకు ఎంత కష్టమైనా అనుభవిస్తారని తెలిపారు.. ఇక గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఆయనని కలవడం కోసం పవన్ కళ్యాణ్ వెళ్తుండగా పోలీసులు మార్గమధ్యమంలోనే ఆపేశారు. దీంతో ఆయన రోడ్డు పైనే పడుకొని నిరసన తెలిపిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సంఘటన గురించి అంజనాదేవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియోని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇంకా ఈమె పవన్ కి సంబంధించి ఎలాంటి విషయాలను వెల్లడించారనేది తెలియాల్సి ఉంది.

Share This Article