Ramcharan: చరణ్ సినీ కెరియర్ లోనే షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా?

2 Min Read

Ramcharan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా వారసుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు రామ్ చరణ్. మెగా వారసుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత అనే సినిమా ద్వారా ఈయన హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతో హిట్ కొట్టిన చరణ్ అనంతరం మగధీర వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఒకవైపు భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడమే కాకుండా మరోవైపు తన నటనా శైలితో ప్రేక్షకులను మెప్పించడంతో ఈయనకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా నటన పరంగా అంచెలంచలుగా ఎదుగుతూ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ సినీ కెరియర్ లో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన ఒక సినిమా కూడా ఉందనే విషయం చాలా మందికి తెలియదు.

ఈ సినిమా ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే షూటింగ్ ఆపి వేయాల్సి వచ్చింది. మరి చరణ్ కెరియర్ లో ఇలా మధ్యలోనే షూటింగ్ ఆపి వేసిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. ఆరెంజ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే చరణ్ మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మెరుపు అనే సినిమాకు కమిట్ అయ్యారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

ఇక ఈ సినిమాకు బంగారం సినిమా దర్శకుడు ధరణి డైరెక్టర్ గా వ్యవహరించారు. కొద్దిరోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అయితే ముందుగా ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు కావడంతో నిర్మాతలు ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్లలేక పోయారు. ఇక చిరంజీవి సైతం ఈ సినిమా షూటింగ్ ఆపివేయమని చెప్పడంతో చరణ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో రావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. ఇక అప్పటికే ఆరెంజ్ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో విషయానికి వస్తే ఈయన శంకర్ డైరెక్షన్ లో నటించిన గేమ్ ఛేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

TAGGED:
Share This Article